తుపాకీ పేల్చి.. దాడి చేసి..
హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు మద్యం దుకాణ సిబ్బందిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. ఆపై దాడి చేసి రూ.2.08 లక్షలు దోపిడీ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దొంగల హల్చల్
మద్యం దుకాణ సిబ్బంది దగ్గర రూ.2.08 లక్షల దోపిడీ
శామీర్పేట, న్యూస్టుడే: హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు మద్యం దుకాణ సిబ్బందిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. ఆపై దాడి చేసి రూ.2.08 లక్షలు దోపిడీ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..ఉద్దెమర్రి గ్రామంలో సామల ముత్యంరెడ్డి మద్యం దుకాణంలో క్యాషియర్గా బాలకిషన్... అతని సహాయకునిగా మర్రి జైపాల్రెడ్డి పనిచేస్తున్నారు. రోజు మాదిరి సోమవారం రాత్రి 10 గంటలకు దుకాణం షెట్టర్ మూసేసి లోపల డబ్బులు లెక్కించారు. రూ.2.08 లక్షల్ని బ్యాగులో వేసుకుని జైపాల్రెడ్డి ద్విచక్రవాహనం వద్దకు వెళ్లి నిల్చున్నాడు. దుకాణానికి బాలకిషన్ తాళం వేస్తున్న సమయంలో ముఖానికి ముసుగులు ధరించిన 25-30 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. బెదిరిస్తూ కర్రలతో ఒక్కసారిగా జైపాల్రెడ్డిపై దాడి చేశారు. పక్కనే ఉన్న బాలకిషన్ అడ్డుకొని కర్ర లాక్కొని దొంగలపై తిరగబడ్డారు. ఇంతలోనే ముగ్గురిలో ఓ వ్యక్తి దేశవాళీ తుపాకీ తీసి బాలకిషన్ వైపు గురిపెట్టి కాల్చాడు. అతడు తప్పించుకోవడంతో తూటా మద్యం దుకాణం షెట్టరుకు తగిలింది. తుపాకీ గురిపెట్టి జైపాల్రెడ్డి వద్ద ఉన్న నగదు లాక్కొని రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఉద్దెమర్రి-మూడుచింతలపల్లి రహదారి మీదుగా పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ చేసిన అనంతరం నిందితులు ఉద్దెమర్రి నుంచి బొమ్మలరామారం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను శోధిస్తున్నారు. పక్కా రెక్కీ చేసి సొత్తు లాక్కెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నంబరు ప్లేటు లేని వాహనంపై వచ్చినట్లు బాధితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప 81వ బెటాలియన్లో చోటు చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు