నూర్పిడి యంత్రంలో పడి మహిళ దుర్మరణం
పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు వేరుశనగ నూర్పిడి యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.
వేర్వేరుగా తెగిపడిన తల, మొండెం
కోడేరు, న్యూస్టుడే: పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు వేరుశనగ నూర్పిడి యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో జరిగింది. పోలీసులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని తీగలపల్లికి చెందిన సాంబశివుడికి వేరుశనగ నూర్పిడి యంత్రం ఉంది. అదే గ్రామానికి చెందిన గొల్ల గంగమ్మ(36)తో పాటు తోటి కూలీలతో యంత్రం యజమాని వేరుశనగ నూర్పిడికి తీసుకెళ్లారు. జనుంపల్లికి చెందిన ఓ రైతుకు కోడేరు శివారులో ఉన్న ఎకరా పొలంలో పంట నూర్పిడి చేసేందుకు బుధవారం వెళ్లారు. పనులు చేస్తుండగా ట్రాక్టర్కు అమర్చిన కంప్రెషర్ రాడ్, నూర్పిడి యంత్రం జాయింట్ మధ్యలో పడి ఉన్న వేరుశనగ కట్టెను తీసేందుకు గంగమ్మ వెళ్లారు. ముఖానికి కట్టుకున్న ముసుగు రాడ్కు చుట్టుకోవడంతో మొండెం నుంచి తల పూర్తిగా తెగిపడిపోయింది. తోటి కూలీలు వచ్చి చూసేసరికే మొండెం కొట్టుకుంటూ రక్తపుమడుగులో కనిపించింది. ఎస్సై నరేందర్రెడ్డి ఘటనాస్థలికి వచ్చి పంచనామా చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్కు చెందిన శ్రీనుతో గంగమ్మకు 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కొడుకు ఉన్నాడు. భర్తతో మనస్పర్థలు వచ్చి ఏడాదిన్నర నుంచి పుట్టింట్లో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఈమె కుమారుడు తండ్రి వద్దే ఉంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి