ఏపీలో తయారీ... కర్ణాటకలో చలామణి
కర్ణాటక, ఆంధప్రదేశ్లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో పట్టుబడిన నిందితులు.. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ విభాగం అదనపు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు.
వైకాపా నాయకురాలు రజని కీలక నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసు వ్యవహారం
అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో ముద్రణ
ఈనాడు- అమరావతి, బెంగళూరు, న్యూస్టుడే- బెంగళూరు (మల్లేశ్వరం): కర్ణాటక, ఆంధప్రదేశ్లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో పట్టుబడిన నిందితులు.. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ విభాగం అదనపు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. చరణ్సింగ్, రజని, గోపీనాథ్, పుల్లలరేవు రాజాలను నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, ఏపీ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజని (38) నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసులో బెంగళూరు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో వైకాపా నాయకురాలు రజని, ప్రొద్దుటూరుకు చెందిన చరణ్సింగ్ను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీసులు... వారిని వైయస్ఆర్, అనంతపురం జిల్లాలకు తీసుకొచ్చి నకిలీ నోట్ల ముద్రణ కేంద్రాలు, భద్రపరిచే స్థావరాల్లో దాడులు నిర్వహించారు. రూ.11 లక్షల నకిలీ నోట్లు, వాటిని ముద్రించేందుకు ఉపయోగించే యంత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధాలున్న గోపీనాథ్, రాజా అనే మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో నాయకుల అండదండలు!
బెంగళూరులోని ఉత్తరాహళ్లి-కెంగేరి ప్రధాన రహదారిలో పూర్ణప్రజ్ఞా లే అవుట్ సాధనా కళాశాల వద్ద బొలెరో వాహనంలో నకిలీ నోట్ల కట్టలు పెట్టుకుని.. వాటిని మార్చుతూ రజని అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె వద్దనున్న రూ.4.09 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రజని వైకాపా నాయకురాలు కావటం, ముఖ్య నాయకులతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమె ఫోన్ను విశ్లేషించినప్పుడు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. వైయస్ఆర్, అనంతపురం జిల్లాలకు చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. వారిని త్వరలో విచారణకు పిలిపించే అవకాశం ఉంది.
నకిలీ నోట్ల తయారీలో ‘రాజా’!
ప్రొద్దుటూరుకు చెందిన చరణ్సింగ్, రజని కలిసి అనంతపురం, చిక్కబళ్లాపురాలకు చెందిన బృందాల నుంచి నకిలీ నోట్లను సేకరించేవారని దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనంతపుర¢ం వాసి పుల్లలరేవు రాజా నకిలీ నోట్ల తయారీలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడని పోలీసు అధికారి సందీప్ పాటిల్ వివరించారు. రాజాకు సాంకేతిక సహకారం అందిస్తున్న గోపీనాథ్ అనే వ్యక్తి గురించీ వివరాలు రాబడుతున్నారు.
వైకాపా నుంచి రజని సస్పెన్షన్
కడప, నేరవార్తలు, న్యూస్టుడే: నకిలీ నోట్ల కేసులో నిందితురాలైన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజనిని వైకాపా నుంచి సస్పెండు చేస్తూ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మీడియాకు వెల్లడించారు. రజనిపై కేసు నమోదవడంతో ఆమెపై నివేదిక పంపాలని పార్టీ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండు చేయాలని నివేదిక పంపానని వివరించారు. వెంటనే పార్టీ చర్యలు తీసుకుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం