Crime News: బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
ఏడాది కిందట అదృశ్యమై, శవమై కనిపించిన శ్రేయస్ (19) అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
బెంగళూరు (రామనగర), న్యూస్టుడే: ఏడాది కిందట అదృశ్యమై, శవమై కనిపించిన శ్రేయస్ (19) అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో క్రిమినల్ న్యాయవాది శంకర్గౌడ, అతని అనుచరుడు అరుణ్ను ప్రధాన నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష ద్వారా నేరాన్ని నిర్ధారించినట్లు రామనగర జిల్లా ఎస్పీ సంతోష్బాబు గురువారం విలేకరులకు వివరించారు. బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా నిందితులను గుర్తించడం కర్ణాటకలో ఇదే తొలిసారి. బెంగళూరు సమీపంలోని కనకపురకు చెందిన శ్రేయస్ చదువుకుంటూనే శంకర్గౌడ కార్యాలయంలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవారు. 2022 మే 19న రాత్రి ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి బయల్దేరిన ఆయన ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లి ఆశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కాల్డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. మృతదేహం దొరికిన తర్వాత వైద్య పరీక్షల్లో అసహజ లైంగిక క్రియ అనంతరం శ్రేయస్ను ఊపిరాడకుండా చేసి, చంపేసినట్లు నివేదిక వచ్చింది. తమకు ఈ హత్యతో సంబంధం లేదని నిందితులు వాదించారు. దీంతో శంకర్గౌడకు బ్రెయిన్ మ్యాపింగ్ విధానంలో తలకు సెన్సర్లు బిగించి, నిపుణులు, వైద్యుల సహాయంతో పరీక్ష చేశారు. శ్రేయస్కు మత్తు పానీయం ఇచ్చి, లైంగిక చర్య అనంతరం గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేశామని నిందితుడు ఈ పరీక్షలో అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు