కుస్తీ పోటీల్లో అపశ్రుతి
వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ పోటీదారుడు తన ప్రత్యర్థి గొంతుపై తొడతో బలంగా నొక్కడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
గొంతుపై నొక్కడంతో ఊపిరాడక పోటీదారు మృతి
లఖీసరాయ్: వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ పోటీదారుడు తన ప్రత్యర్థి గొంతుపై తొడతో బలంగా నొక్కడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. బిహార్లోని లఖీసరాయ్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుసేనా గ్రామంలో వసంత పంచమి రోజున కుస్తీ పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జెనూ యాదవ్, పట్నా జిల్లాకు చెందిన త్రిపురారి కుమార్ బరిలో దిగారు. ఈక్రమంలో త్రిపురారి యాదవ్ గొంతుపై జెనూ యాదవ్ తన తొడను బలంగా నొక్కి ఉంచాడు. దీంతో త్రిపురారి శ్వాస ఆడక ప్రాణం వదిలాడు. ఇది తెలిసి రెజ్లింగ్ నిర్వాహకులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్