దిల్లీలో మళ్లీ ‘స్కూటీ’ ఘటన

కొత్త సంవత్సరాది వేళ.. అంజలి అనే యువతి స్కూటీపై వెళుతుండగా జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసును మరవకముందే.. అలాంటి ఘటనే మరొకటి దేశ రాజధానిలో వెలుగు చూసింది.

Updated : 29 Jan 2023 05:38 IST

ఇద్దరు యువకుల మృతి

కొత్త సంవత్సరాది వేళ.. అంజలి అనే యువతి స్కూటీపై వెళుతుండగా జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసును మరవకముందే.. అలాంటి ఘటనే మరొకటి దేశ రాజధానిలో వెలుగు చూసింది. దిల్లీలోని కేశవపురం కన్హయ్య నగర్‌ ప్రాంతంలో ప్రేరణ చౌక్‌ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు గాలిలో ఎగిరి కారు టాపుపై పడిపోయాడు. మరో యువకుడు ఎగిరిపడి కారు బానెట్‌లో ఇరుక్కుపోయాడు. కారు బంపర్‌లో స్కూటీ చిక్కుకుపోయింది. అలాగే 350 మీటర్లు ఈడ్చుకెళ్లారు. కారులో ఉన్న అయిదుగురు నిందితులు పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వీరంతా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న కైలాశ్‌ భట్నాగర్‌, సుమిత్‌ ఖరీ మృతిచెందారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని