ధన్‌బాద్‌లోని నర్సింగ్‌ హోంలో అగ్నిప్రమాదం

ఝార్ఖండ్‌లోని ఓ నర్సింగ్‌ హోంలో అగ్నిప్రమాదం సంభవించి వైద్య దంపతులు సహా కనీసం ఐదుగురు మరణించారు. ధన్‌బాద్‌ నగరంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.

Published : 29 Jan 2023 04:25 IST

ఐదుగురి మృతి

ధన్‌బాద్‌: ఝార్ఖండ్‌లోని ఓ నర్సింగ్‌ హోంలో అగ్నిప్రమాదం సంభవించి వైద్య దంపతులు సహా కనీసం ఐదుగురు మరణించారు. ధన్‌బాద్‌ నగరంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. డాక్టర్‌ వికాస్‌ హాజ్రా, అతడి భార్య ప్రేమ హాజ్రా అనే దంపతులు నిర్వహిస్తున్న ఆ నర్సింగ్‌ హోంలోనే వారి నివాస గృహమూ ఉంది. శనివారం తెల్లవారుజామున ఇక్కడ అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వైద్య దంపతులు, వారి మేనల్లుడు, పనిమనిషి మృతదేహాలను గుర్తించగా మరొక మృతదేహం గురించి తెలియాల్సి ఉంది. గాయాలపాలైన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. స్టోర్‌ రూంలో ఎగసిన మంటల వల్ల ఊపిరాడక వీరు మరణించి ఉంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రమాదంలో వైద్యుల పెంపుడు శునకమూ ప్రాణాలు కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని