ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

ఉద్యోగం రాలేదని, కుటుంబానికి భారమవుతున్నాననే మనస్తాపంతో ప్రకాశం జిల్లా దర్శిలో కిరణ్‌ కుమార్‌ (22) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 29 Jan 2023 04:37 IST

దర్శి, న్యూస్‌టుడే: ఉద్యోగం రాలేదని, కుటుంబానికి భారమవుతున్నాననే మనస్తాపంతో ప్రకాశం జిల్లా దర్శిలో కిరణ్‌ కుమార్‌ (22) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరగ్గా శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం... దర్శికి చెందిన బెల్లంకొండ బాబు, మరియమ్మ దంపతుల కుమారుడు కిరణ్‌ కుమార్‌ కనిగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నెల నుంచి స్థానికంగా ఓ రెస్టారెంటులో పని చేస్తున్నారు. తన చదువుకు తగిన ఉద్యోగం రాలేదన్న బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి... ఆత్మహత్యకు ముందు కిరణ్‌కుమార్‌ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని