పాదచారులపైకి లారీ దూసుకెళ్లి ఆరుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పాదచారులపైకి దూసుకుపోవడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 30 Jan 2023 03:52 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పాదచారులపైకి దూసుకుపోవడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదానికి కాస్త ముందు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో పంగి ఖుర్ద్‌ గ్రామ సమీపంలోని పిలిభిత్‌ బస్తీ రహదారిపై ఓ కారు ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి గాయపడగా.. స్థానికులు ప్రమాదస్థలి చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో బహ్రాయిచ్‌ నుంచి వేగంగా వస్తున్న లారీ ప్రజలపైకి దూసుకెళ్లి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని