గుజరాత్ ప్రశ్నపత్రం.. హైదరాబాద్లో లీక్
గుజరాత్లో పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్లో లీక్ అయింది.
ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి సహా 15 మంది అరెస్టు
అహ్మదాబాద్, ఈనాడు-హైదరాబాద్, జిన్నారం-న్యూస్టుడే: గుజరాత్లో పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్లో లీక్ అయింది. 1,181 పోస్టులకు సుమారు 9.53 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఓ ముఠా దగ్గర ప్రశ్నపత్రం ఉందని పోలీసులు గుర్తించడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు గుర్తించారు. గుజరాత్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) పోలీసు అధికారులు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు ప్రదీప్ నాయక్, కేతన్ బరోట్, హైదరాబాద్లోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి జీత్ నాయక్, భాస్కర్ చౌదరి, రిద్ధి చౌదరి ఉన్నారు. వీరిలో 10 మంది గుజరాత్కు చెందినవారు కాగా, ప్రదీప్ నాయక్ ఒడిశా వాసి. ప్రదీప్ నాయక్ నుంచి రాబట్టిన సమాచారంతో ప్రశ్నపత్రాల లీక్కు కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ సర్దార్కర్ రోహా సహకరించినట్లు నిర్ధరించుకున్నారు. గుజరాత్కు చెందిన కేతన్ బరోట్ అక్కడ దిశా, ఇండోక్టినేషన్ కన్సల్టెన్సీల పేరుతో బోగస్ అడ్మిషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆదివారం 10-11 గంటల మధ్య కేఎల్ హైటెక్ సెక్యూర్ ప్రింటింగ్ లిమిటెడ్ సంస్థలో గోప్యంగా తనిఖీలు నిర్వహించారు. సర్దార్కర్ రోహాతో పాటు జీత్ నాయక్, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రాలు నగరంలో తయారవుతున్న విషయం ఎలా బయటకు పొక్కింది? ప్రధాన నిందితులతో ఆపరేటర్కు ఉన్న పరిచయాలు, సర్వీస్ కమిషన్ ఉద్యోగుల ప్రమేయం తదితర అంశాలపై వారు కూపీ లాగుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్లోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీ చేసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.