తండ్రిపై దాడి.. వేళ్లు, పురుషాంగం కత్తిరింపు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాశీపుర్ పట్టణంలో ఓ తనయుడు.. తండ్రిపై దాడి చేసి ఎడమచేతి వేళ్లు, పురుషాంగం కోసేశాడు.
నిందితుడు ఆర్మీ ఉద్యోగి
కాశీపుర్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాశీపుర్ పట్టణంలో ఓ తనయుడు.. తండ్రిపై దాడి చేసి ఎడమచేతి వేళ్లు, పురుషాంగం కోసేశాడు. సోదరుడి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న కుమారుడు అర్పిత్తోపాటు అదే ప్రాంతానికి చెందిన రోహిత్వర్మ, రాహుల్ సైనీ, మరొకరు డిసెంబర్ 26న తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక కచనాల్గాజీ కుమావూన్ కాలనీలో తనపై ఈ దాడి జరిగిన సమయంలో వారంతా తాగి ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు తన కాళ్లూచేతులు, నోరు నొక్కి పట్టగా.. నాలుగో వ్యక్తి కలప కోసే పరికరంతో దాడి చేసినట్లు వివరించారు. దాడి అనంతరం తాను స్పృహ తప్పి పడిపోగా, నిందితులు పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ గొడవల కారణంగా ఈ దాడి జరిగిందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కాశీపుర్ ఎస్పీ అభయ్సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.