తండ్రిపై దాడి.. వేళ్లు, పురుషాంగం కత్తిరింపు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్‌ నగర్‌ జిల్లా కాశీపుర్‌ పట్టణంలో ఓ తనయుడు.. తండ్రిపై దాడి చేసి ఎడమచేతి వేళ్లు, పురుషాంగం కోసేశాడు.

Published : 01 Feb 2023 04:18 IST

నిందితుడు ఆర్మీ ఉద్యోగి

కాశీపుర్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్‌ నగర్‌ జిల్లా కాశీపుర్‌ పట్టణంలో ఓ తనయుడు.. తండ్రిపై దాడి చేసి ఎడమచేతి వేళ్లు, పురుషాంగం కోసేశాడు. సోదరుడి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న కుమారుడు అర్పిత్‌తోపాటు అదే ప్రాంతానికి చెందిన రోహిత్‌వర్మ, రాహుల్‌ సైనీ, మరొకరు డిసెంబర్‌ 26న తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక కచనాల్‌గాజీ కుమావూన్‌ కాలనీలో తనపై ఈ దాడి జరిగిన సమయంలో వారంతా తాగి ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు తన కాళ్లూచేతులు, నోరు నొక్కి పట్టగా.. నాలుగో వ్యక్తి కలప కోసే పరికరంతో దాడి చేసినట్లు వివరించారు. దాడి అనంతరం తాను స్పృహ తప్పి పడిపోగా, నిందితులు పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ గొడవల కారణంగా ఈ దాడి జరిగిందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కాశీపుర్‌ ఎస్పీ అభయ్‌సింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని