గంజాయి గ్యాంగ్ ఆగడాలను భరించలేకపోతున్నాం
‘ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు.
తాడేపల్లి స్టేషన్కు వచ్చిన లంబాడీపేట మహిళలు
సీఎం ఇంటి సమీపంలో దుస్థితిపై ఆవేదన
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-తాడేపల్లి: ‘ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం’ అని లంబాడీపేట మహిళలు మంగళవారం తాడేపల్లి స్టేషన్ తలుపుట్టారు. సీఎం నివాసానికి అర కిలోమీటరు దూరంలోనే లంబాడీపేట ఉంటుంది. రెండురోజుల క్రితం ఇంట్లో ఉన్న బాలుడిని తీసుకెళ్లి గంజాయి బ్యాచ్ బీరు సీసాతో తీవ్రంగా దాడిచేసి గాయపరిచిందని, ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నా పోలీసులు పట్టించుకోవటం లేదని మహిళలు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉండే కృష్ణా కెనాల్ జంక్షన్ యార్డులను అడ్డాగా చేసుకుని గంజాయి గ్యాంగులు చెలరేగుతున్నాయని వారు తెలిపారు. సాయిబాబా మందిరం వద్ద నుంచి ముగ్గురోడ్డు వరకు వీరి ఆగడాలు, అకృత్యాలు పోలీసులకు పట్టడం లేదన్నారు. కొద్దిరోజుల క్రితం ఓ హోంగార్డును రక్తం చిందేలా గాయపరిచారని, ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీకుమార్తెలపై దాడికి తెగబడ్డారని, తాజాగా తమ కాలనీకి చెందిన ఓ యువకుడిని బీరుబాటిళ్లతో పొడవడంతో వారి ఆగడాలను భరించలేక స్టేషన్కు రావాల్సి వచ్చిందని వారు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్