మిర్చి వ్యాపారి కిడ్నాప్
గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం గుంటూరు మిర్చి యార్డు సమీపంలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి అతన్ని దుండగుల నుంచి కాపాడారు.
తోటి వ్యాపారి పనేనని అనుమానం
బాధితుడిని కాపాడిన పోలీసులు
గుంటూరు (మిర్చియార్డు), న్యూస్టుడే: గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం గుంటూరు మిర్చి యార్డు సమీపంలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి అతన్ని దుండగుల నుంచి కాపాడారు. గుంటూరులో సంచలనం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి.. కొత్తపేటకు చెందిన పొత్తూరి శివ నరేంద్రకుమార్ మిర్చి వ్యాపారి. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై మిర్చి యార్డుకు బయలుదేరారు. కాపుగాసిన ఆరుగురు దుండగులు అతనిపై దాడి చేశారు. బలవంతంగా కారులో తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నరేంద్రకుమార్ కుమారుడు కృష్ణచైతన్య నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాపురానికి చెందిన మిర్చి వ్యాపారి బర్మా వెంకట్రావు తన తండ్రిని కిడ్నాప్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ హైమారావు వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వినుకొండ వద్ద పోలీసుల తనిఖీలు గమనించిన దుండగులు నరేంద్రకుమార్ను కారులో వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారులో నరేంద్రకుమార్ను గుర్తించి, అతన్ని గుంటూరుకు తీసుకొచ్చారు. బాధితుడు మాట్లాడుతూ ‘నన్ను కొట్టి.. రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రాణభయంతో అంగీకరించా. బర్మా వెంకట్రావు కోటప్పకొండ వద్ద కిడ్నాపర్లతో చేరాడు. చొక్కాకు రక్తం అంటడంతో మార్చేందుకు వినుకొండ వద్ద కారు ఆపారు. అప్పుడే పోలీసులు చూసి నన్ను రక్షించారు’ అని తెలిపారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వెంకట్రావును పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు నరేంద్రకుమార్ కిడ్నాప్ను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..