విచారణ పేరుతో కొడతారా?
విచారణ పేరుతో గిరిజనుడిని తీవ్రంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళనకు దిగారు.
పార్వతీపురం మన్యం జిల్లా జీఎల్పురంలో గిరిజనుల ఆందోళన
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: విచారణ పేరుతో గిరిజనుడిని తీవ్రంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం బైఠాయించారు. అనంతరం తహసీల్దారు రాములమ్మకు ఫిర్యాదు అందజేశారు. అందులోని వివరాల ప్రకారం... దుడ్డుఖల్లు గ్రామానికి చెందిన కొండగొర్రి కామరాజు, పార్వతి దంపతులను అదే గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనులు చేసేందుకు మూడేళ్ల కిందట వార్డెన్ సుబ్బారావు నియమించారు. కొంతకాలం కిందట వారు పనిమానేశారు.
జీతం బకాయి అడిగారన్న కోపంతో.. వసతిగృహం ఆవరణలో ఉన్న జనరేటర్ దొంగతనం చేశారంటూ కామరాజు, పార్వతిపై వార్డెన్ ఎల్విన్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ షన్ముఖరావు కామరాజును స్టేషన్కు పిలిచి సిబ్బందితో కొట్టించారు. కాళ్లు, పాదాలు, తొడలు, పొట్ట, వీపుపైన లాఠీలతో కొట్టి, బూట్లతో తన్ని విడిచిపెట్టారు. రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత కామరాజు అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వార్డెన్ సుబ్బారావు, విచారణ పేరుతో కొట్టిన ఎస్ఐ షన్ముఖరావు, సిబ్బందిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు స్పష్టంచేశారు. దీనిపై సీఐ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘‘వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణలో భాగంగా కొట్టారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం, గిరిజనులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై దర్యాప్తు నిర్వహిస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM