సీఎం సభకు వెళ్తూ ప్రమాదానికి గురైన వృద్ధురాలి మృతి
రాజమహేంద్రవరంలో నిర్వహించిన సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లకు తీవ్రగాయాలై కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు పార్వతి (70) గురువారం మృతిచెందారు.
కాకినాడ (మసీదు సెంటర్), న్యూస్టుడే: రాజమహేంద్రవరంలో నిర్వహించిన సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లకు తీవ్రగాయాలై కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు పార్వతి (70) గురువారం మృతిచెందారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరానికి చెందిన ఆమె ముఖ్యమంత్రి జగన్ రోడ్షో, బహిరంగసభ రోజు ఘటన జరిగింది. గత నెల 3న రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బస్సు ఢీకొట్టింది. ఆమెపై నుంచి ముందుచక్రం వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి ఎడమ కాలును మోకాలిపై వరకు తొలగించారు.
భర్త పింఛను రద్దయిపోతుందనే భయంతో..
సీఎం సభకు వెళ్లకపోతే భర్తకు వచ్చే పింఛను రద్దయిపోతుందని వాలంటీర్లు బలవంతం చేయడంతోనే పార్వతి బయల్దేరారని అదేరోజు స్థానికులు చెప్పారు. పార్వతికి జీజీహెచ్ ఐసీయూలో అత్యున్నత వైద్యం అందించామని, కోలుకుంటున్న క్రమంలో మృతిచెందడం దురదృష్టకరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.హేమలతాదేవి తెలిపారు. సీఎం సభకు ఏర్పాటుచేసిన బస్సులో వెళ్లి దిగుతూ జారిపోతే.. మరో వాహనం వచ్చి ఢీకొట్టిన వార్త అవాస్తవమని తూర్పుగోదావరి జిల్లా పోలీసు, కలెక్టర్ కార్యాలయాల ప్రతినిధులు గతంలోనే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన సొంత పనిమీద రాజమహేంద్రవరం వచ్చినప్పుడే ప్రమాదం జరిగిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ