Crime News: క్షుద్రశక్తుల కోసం.. మంత్రగాడిని చంపి రక్తం తాగాడు

ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడు దారుణంగా చంపాడు. అనంతరం అతడి రక్తం తాగాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు.

Updated : 04 Feb 2023 08:25 IST

ధమ్‌తరీ: ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడు దారుణంగా చంపాడు. అనంతరం అతడి రక్తం తాగాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బసంత్‌ సాహు(50) అనే వ్యక్తి దగ్గర నిందితుడు రౌనక్‌ సింగ్‌ ఛబ్రా అలియాస్‌ మన్య(25) చావ్లా క్షుద్రపూజలు నేర్చుకుంటున్నాడు. బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు వస్తాయని భావించాడు. బసంత్‌ క్షుద్రపూజలు చేస్తుండగా అతడిపై దాడి చేసి చంపి రక్తం తాగాడు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టాడు. పోలీసులు గురువారం పాక్షికంగా కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని