గంజాయి స్మగ్లర్ల బీభత్సం
ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొట్టి తప్పించుకున్నారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో సరకు తరలించే యత్నం
అడ్డగించిన ఆబ్కారీ, పోలీసు సిబ్బందిని ఢీకొట్టి మరీ పలాయనం
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని దొరికిపోయిన నిందితులు
ఇల్లెందు, న్యూస్టుడే: ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొట్టి తప్పించుకున్నారు. ఆ క్రమంలో వాహనాన్ని వేగంగా నడుపుతూ..జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ..చివరికి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..మహారాష్ట్రకు చెందిన సాగర్దుక్కడ్, ఆనంద్ బాలాజీ మక్కాడ్, అమూల్ రాందాస్లు ఒడిశా రాష్ట్రంలో 350 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. సరకును కారులో సర్దుకుని, మహారాష్ట్రకు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది భద్రాచలంలో బ్రిడ్జి పాయింట్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించారు. గమనించిన స్మగ్లర్లు వేగం తగ్గించినట్టే తగ్గించి..వెంటనే అతివేగంతో బారికేడును ఢీకొట్టి తప్పించుకున్నారు. అప్రమత్తమైన అధికారులు పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు పోలీస్, ఆబ్కారీ సిబ్బందికి సమాచారమిచ్చారు. పాల్వంచ, కొత్తగూడెం దాటి అతివేగంగా వస్తున్న కారును ఇల్లెందులో అడ్డగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. స్మగ్లర్లు కారును ఆపకపోగా, అదే వేగంతో ఆబ్కారీ హెడ్ కానిస్టేబుల్ బాబాను ఢీకొట్టి పట్టణంలోకి ప్రవేశించారు. ఆబ్కారీ, పోలీసులు కలిసి వెంబడించడంతో రైల్వే బ్రిడ్జి మీదుగా వాహనాన్ని మళ్లించారు. కొత్త బస్టాండు మలుపు వద్ద ఉన్న పురపాలక పారిశుద్ధ్య కార్మికులను తప్పించే క్రమంలో కారు డివైడర్కు తగిలి, అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ ధాటికి స్తంభం విరిగిపోవడం, కారు ఎటూ కదలకపోవడంతో అందులోని ముగ్గురు నిందితులు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న రూ.70లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, కారు ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ బాబాకు స్వల్ప గాయాలయ్యాయని డీఎస్పీ వెల్లడించారు. ‘ఎవరి కంటా పడకుండా సరకు తరలించేందుకు స్మగ్లర్లు ఇన్నోవా కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోపలి వ్యక్తులు కనిపించకుండా నల్ల అద్దాలు అమర్చారు. కారు నంబరును తొలగించి, ఓ ఆటో నంబరును (ఏపీ 31 బీక్యూ 1154) జోడించారు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే