Hyderabad: ఓ భర్త ఘాతుకం.. నడివీధిలో భార్య దారుణ హత్య
భర్త వేధింపులు భరించలేక వేరుగా ఉంటున్న ఓ మహిళను అతడు నడివీధిలో దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్ లంగర్హౌస్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మెహిదీపట్నం, న్యూస్టుడే: భర్త వేధింపులు భరించలేక వేరుగా ఉంటున్న ఓ మహిళను అతడు నడివీధిలో దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్ లంగర్హౌస్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. లంగర్హౌస్ డిఫెన్స్కాలనీ (హాషంనగర్)కి చెందిన కరీనా బేగం(30)కు టోలిచౌకి హకీంపేటకు చెందిన మహ్మద్ యూసుఫ్(36)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5, 3, 2 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులున్నారు. పెళ్లయ్యాక కొద్దిరోజులు సజావుగా ఉన్న భర్త నుంచి తర్వాత ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. పిల్లల కోసం చాలాకాలం ఓపిక పట్టిన ఆమె భరించలేక ఏడాదిన్నర క్రితం పిల్లలతో పుట్టింటికి చేరారు. చిన్నారుల పోషణ కోసం లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయినిగా చేరారు. అయితే తన దారికి రావట్లేదనే అక్కసుతో యూసుఫ్ నాలుగైదు రోజులుగా భార్య కదలికలను గమనిస్తూ వచ్చాడు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కరీనా బేగం స్కూలుకు వెళ్లేందుకు ఇంట్లోంచి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లేసరికి అక్కడ ప్రత్యక్షమైన భర్త మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. నడుచుకుంటూ వెళ్తున్న ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు లంగర్హౌస్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా