ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
బెంగళూరులో ఏపీ ముఠా అరెస్టు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితుల ఖాతాల నుంచి రూ.5,95,585 నగదును డ్రా చేయకుండా కట్టడిచేశారు. విజయవాడకు చెందిన మల్లు శివశంకర్రెడ్డి అలియాస్ గోపీచంద్ (26), గుంజ మంగారావు (35), ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్ శహబాషి (30), గుంటూరుకు చెందిన మహేశ్ (21) అనే యువకులను అరెస్టు చేసినట్లు డీసీపీ డాక్టర్ అనూప్శెట్టి వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన హైదరాబాద్వాసి- ప్రదీప్ మల్లు శివశంకర్రెడ్డిని సంప్రదించాడు. జనవరి 11న ప్రదీప్ బెంగళూరు రాగా, ఆ నలుగురు స్వాగతం పలికారు. వారు వచ్చిన కారు వివరాలను ప్రదీప్ ఫొటో తీసుకుని పెట్టుకున్నాడు. ఉద్యోగంలో చేరేందుకు కావల్సిన పత్రాల కోసం రూ.30వేలు ఇవ్వాలని నిందితులు చెప్పగా, ప్రదీప్ గూగుల్ పే పనిచేయలేదు. నిందితులు అతడి ఫోన్ తీసుకుని పరిశీలించారు. అందులో కారు ఫొటో గుర్తించి.. ఎందుకు తీశావని దాడి చేసి, రూ.6 లక్షలు బలవంతంగా ఖాతాలో వేయించుకున్నాక.. యలహంక సమీపంలో దింపేసి వెళ్లిపోయారు. ప్రదీప్ కోడిగెహళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో డొంకంతా కదిలింది. మల్లు శివశంకర్రెడ్డి ఫేస్బుక్ ఖాతాతో ఉద్యోగాల వ్యాపారం మొదలుపెట్టాడని గుర్తించారు. అతడిని అరెస్టుచేయగా, మిగిలిన ముగ్గురి వివరాలూ బయటపడ్డాయి.
కటకటాల్లోకి మరో యువకుడు: నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాను ప్రారంభించి, యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి, దారుణాలకు పాల్పడుతున్న ఆరోపణపై గుంటూరు నివాసి ప్రసాద్ అలియాస్ దిల్లీ ప్రసాద్ (29) అనే యువకుడిని బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉద్యోగాల కోసం సంప్రదించే యువతులను మోసగించి, లైంగికదాడులకు పాల్పడినట్లు గుర్తించామని నగర పోలీసు కమిషనర్ ప్రతాప్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?