స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం
స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీసులు రిమాండ్కు తరలించారు.
భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘటన
శామీర్పేట, న్యూస్టుడే: స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీసులు రిమాండ్కు తరలించారు. శామీర్పేట ఇన్స్పెక్టర్ వి.సుధీర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చక్రధర్గౌడ్(36), బాధిత మహిళ భర్త సిద్దిపేటలో ఒకే కాలనీలో నివసించే వారు. కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబం బతుకుతెరువు కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంటకు వచ్చింది. ఆమె ప్రయివేట్ నర్సుగా పనిచేస్తోంది. చక్రధర్గౌడ్ తన మిత్రుడిని జనవరి 31 రాత్రి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో విందుకు ఆహ్వానించాడు. అక్కడ ఇతర స్నేహితులతో కలిసి మద్యం తాగారు. బాధిత మహిళ భర్తకు వాహనం లేకపోవడంతో చక్రధర్గౌడ్ తోటి స్నేహితులతో కలిసి ఇంటి వద్ద దింపారు. వారు తిరిగి వెళుతుండగా బాధితురాలి భర్త ద్విచక్రవాహనం అల్వాల్లో ఉన్న విషయం తెలుసుకుని, దాన్ని తీసుకునేందుకు నిందితుడి మిత్రుడైన బన్నూ కారులో ఎక్కించారు. మీరు వెళ్లండి నేను వెనకొస్తానని నిందితుడు వారిని పంపించాడు. వారు వెళ్లిన తర్వాత చక్రధర్గౌడ్ మిత్రుడి ఇంటి తలుపు తట్టాడు. మహిళ తన భర్తే వచ్చాడని భావించి తలుపు తెరవడంతో అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చక్రధర్గౌడ్ పారిపోయాడు. భర్త వచ్చిన తరువాత జరిగిన ఘటనను వివరించినా మద్యం మత్తులో పట్టించుకోలేదు. బాధితురాలు దిగాలుగా ఉంటూ రెండు రోజుల క్రితం నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు అల్వాల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలు తల్లితో కలిసి శుక్రవారం రాత్రి శామీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు