దొంగతనం మోపారని 58 ఏళ్ల మహిళపై అత్యాచారం

దొంగతనం మోపారన్న అవమానంతో 58ఏళ్ల మహిళపై 16ఏళ్ల బాలుడు ఆత్యాచారం చేసి ఆపై కొడవలితో దారుణంగా హత్యచేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో జరిగింది.

Published : 06 Feb 2023 04:38 IST

ఆపై కొడవలితో హత్య చేసిన 16 ఏళ్ల బాలుడు

రీవా: దొంగతనం మోపారన్న అవమానంతో 58ఏళ్ల మహిళపై 16ఏళ్ల బాలుడు ఆత్యాచారం చేసి ఆపై కొడవలితో దారుణంగా హత్యచేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో జరిగింది. రెండేళ్ల క్రితం.. టీవీ చూడటానికి ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు బాలుడు. ఇంట్లో ఒకసారి ఫోన్‌ కనపడకపోవడంతో బాలుడే దొంగతనం చేశాడని ఆమె కుటుంబసభ్యులు అతణ్ని నిందించారు. ఈక్రమంలో గతనెల 30న మహిళ భర్త, కుమారుడు ఇంట్లో లేని సమయంలో బాలుడు చొరబడ్డాడు. బాధితురాలిని ద్వారానికి కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తల, ఇతర భాగాల్లో కొడవలితో దాడి చేశాడు. ప్రైవేటు భాగాలలో కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. భవనంలో మృతదేహం ఉన్నట్లు ఈ నెల 1న పోలీసులకు సమాచారం అందింది. అనంతరం బాలుడ్ని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జువేనైల్‌ హోం(బాలల కేంద్రం)కు తరలించినట్లు ఏఎస్పీ వివేక్‌ లాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని