గనుల యజమాని దారుణ హత్య
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె సమీపంలో కోట్ల కుటుంబానికి ముఖ్య అనుచరుడైన లద్దగిరి శ్రీనివాసులు (55) అనే గనుల యజమాని దారుణ హత్యకు గురయ్యారు.
దారి కాచి కత్తులతో పొడిచి హతమార్చిన వైనం
మృతుడు కోట్ల కుటుంబానికి ప్రధాన వర్గీయుడు
గనుల్లో అక్రమాలు బయటపెట్టినందుకే చంపారంటున్న కుటుంబ సభ్యులు
డోన్, డోన్ నేరవిభాగం, ప్యాపిలి, న్యూస్టుడే: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె సమీపంలో కోట్ల కుటుంబానికి ముఖ్య అనుచరుడైన లద్దగిరి శ్రీనివాసులు (55) అనే గనుల యజమాని దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన శ్రీను బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దారిలో కాపుకాచిన కొందరు వ్యక్తులు బావిపల్లె సమీపంలో రోకలిబండలతో దాడి చేసి కత్తులతో పొడిచారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అటువైపుగా వస్తున్నవారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్యాపిలి సీఐ శ్రీరాములు, జలదుర్గం ఎస్సై నరేష్ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. శ్రీనివాసులు (55) కొద్దికాలం క్రితం డోన్ నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్పై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ కారణంగానే ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎవరితో ప్రాణహానో చెప్పలేదంటున్న పోలీసులు
కొద్దికాలంగా ఎవరో బెదిరిస్తున్నారంటూ స్వయంగా తన తండ్రే డోన్ పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని మృతుడి కుమారుడు మధు వాపోయారు. ప్రాణహాని ఉందంటూ రెండు నెలల క్రితమే ఆయన ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని ఇదే విషయమై బాధితుడు ప్రశ్నించగా.. ప్రాణహాని ఉన్నట్లు చెప్పారేగానీ ఎవరిపై అనుమానం ఉందో తెలపలేదని ఆయన పేర్కొన్నారు. శ్రీనుకు గ్రామంలో కొందరితో గొడవలు, మైనింగ్ వ్యాపారులతో విభేదాలు ఉన్నాయని.. వాటితోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ మహిళకు సంబంధించిన వ్యవహారంపై కూడా విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్యకు పాల్పడినవారిని, తెరవెనుక ఉన్నవారని పోలీసులు అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!