Harassment: చిట్టి ‘ఆయా’కు దంపతుల చిత్రహింసలు
పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆమె జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే చిట్టి ఆయాగా మారింది.
పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆమె జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే చిట్టి ఆయాగా మారింది. అదే పని ఆమెకు నరకం చూపించింది. హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన మనీశ్ ఖట్టర్ (36), కమల్జీత్ కౌర్ (34) దంపతులకు మూడున్నరేళ్ల కుమార్తె ఉంది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో అయిదు నెలల క్రితం ఓ సంస్థ ద్వారా ఝార్ఖండ్లోని రాంచీ నుంచి 14 ఏళ్ల బాలికను ఇంటి సహాయకురాలిగా నియమించుకున్నారు.
పనిలో చేరిన కొద్దిరోజులకే బాలికకు వేధింపులు మొదలయ్యాయి. సరిగా పని చేయడం లేదని ఆమెను కొడుతూ, వాతలు పెడుతూ, బ్లేడుతో చేతులపై కోస్తూ హింసించారు. లైంగికంగానూ వేధించారు. భోజనం కూడా పెట్టకపోవడంతో ఇంట్లో ఉండే చెత్తడబ్బాలో పడేసిన మిగులు పదార్థాలు తిని ఆ బాలిక పొట్ట నింపుకొనేది. కౌర్ దంపతుల చేతిలో బాలిక నరకం అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త, సఖి కేంద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. బుధవారం కౌర్ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు బాలికను ఎన్జీవోకు అప్పగించారు. తీవ్రగాయాలతో ఉన్న బాలికకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దీపికా తెలిపారు. సిటీ కోర్టు మనీశ్ ఖట్టర్కు పోలీసు రిమాండ్, కౌర్కు జుడీషియల్ కస్టడీ విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి