Crime News: భార్యను హత్య చేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు
భార్యను దారుణంగా హత్యచేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడో భర్త. ఝార్ఖండ్లోని గిరిడీలో 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది.
ఝార్ఖండ్: భార్యను దారుణంగా హత్యచేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడో భర్త. ఝార్ఖండ్లోని గిరిడీలో 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీశ్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అర్జుమన్ తన మొదటి భర్త సోదరుడితో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఇది నచ్చని మనీశ్ ఆమెను చంపాలనుకున్నాడు. మనీశ్ ఓ రోజు స్వగ్రామానికి వెళ్లే నెపంతో అర్జుమన్ను తీసుకుని కారులో బయల్దేరాడు. దారిమధ్యలో అర్జుమన్ మెడకు దుపట్టాను బిగించి చంపాడు. ఆమె మృతదేహాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టి సిమెంట్తో పూడ్చిపెట్టాడు. హత్య చేసిన మూడు నెలల తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ మనీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచూ స్టేషన్కు వెళ్లి తన భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేవాడు. అయితే అర్జుమన్ తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం తమ కుమార్తెను మనీశే హత్యచేసినట్లు అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు అంజుమన్ మృతదేహాన్ని పాతిపెట్టిన చోట తవ్వగా అస్థిపంజరం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్