Mancherial: క్షణికావేశం.. ప్రేమజంట విషాదాంతం!
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికీ సిద్ధమయ్యారు.. అంతలోనే క్షణికావేశంలో ఆ జంట తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది.
పెళ్లితో ఒక్కటవ్వాల్సిన ఇద్దరూ మృత్యుఒడికి..
హాజీపూర్, న్యూస్టుడే: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికీ సిద్ధమయ్యారు.. అంతలోనే క్షణికావేశంలో ఆ జంట తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. అప్పుల భారంతో అతను, అతని చర్యకు భయపడి ఆమె పురుగుల మందు తాగారు. అనంతరం ఎలాగైనా బతకాలన్న ఆశతో విఫలయత్నం చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలివి.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండకు చెందిన నరెడ్ల సిద్ధయ్య, వసంత దంపతుల చిన్న కుమార్తె సంఘవి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగవెల్లి శ్రీకాంత్ (25)తో ప్రేమలో పడింది. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్.. సంఘవిని తీసుకొని ఎల్లంపల్లి జలాశయం వైపునకు ఆటోలో వెళ్లాడు. అక్కడ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత.. అప్పులు పెరిగిపోయాయని, పెళ్లి చేసుకుంటే జీవనం కష్టంగా మారుతుందని.. వివాహం చేసుకోలేనని ఆమెకు చెప్పిన అతను తనతో తెచ్చుకున్న పురుగుమందు తాగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయానికి లోనైన ఆమె ఆ సీసా లాక్కొని తాను కూడా తాగింది. అనంతరం ఎలాగైనా ఇద్దరం బతకాలి అన్న భావనతో శ్రీకాంత్.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, అదే ఆటోలో ఆమెను తీసుకొని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ శనివారం రాత్రి మృతిచెందగా.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం ఉదయం సంఘవి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి