గంజాయి మత్తులో బాలికపై బ్లేడుతో దాడి

గంజాయి మత్తులో ఓ యువకుడు దారినపోయే బాలిక గొంతు కోసిన ఉదంతమిది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గురువారం జరిగిన దారుణమిది.

Updated : 24 Feb 2023 04:40 IST

కావలి, న్యూస్‌టుడే: గంజాయి మత్తులో ఓ యువకుడు దారినపోయే బాలిక గొంతు కోసిన ఉదంతమిది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గురువారం జరిగిన దారుణమిది. వెంగళరావునగర్‌లోని పొట్టిశ్రీరాములు పురపాలక పాఠశాలలో చోడ హవ్యశ్రీప్రియ (8) రెండో తరగతి చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ ఖాదర్‌బాషా గంజాయికి బానిసయ్యాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న బాలికపై గంజాయి మత్తులో బ్లేడ్‌తో దాడిచేశాడు. గొంతుపై కొంతభాగం తెగింది. చిన్నారి పరుగున ఇంటికి చేరుకుంది. యువకుడు కూడా వాళ్లింటికి వచ్చి, గొంతు కోసింది తానేనని చెబుతూ వీరంగంవేశాడు బాలికను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖాదర్‌బాషాతో పాటు అతని తల్లిదండ్రులను విచారిస్తున్నట్లు కావలి సీఐ కె.శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని