Crime News: శ్రద్ధావాకర్‌ తరహాలో మరో కిరాతక హత్య

దిల్లీలో కలకలం రేపిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధావాకర్‌ హత్యకేసు లాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో మరొకటి వెలుగు చూసింది.

Updated : 02 Mar 2023 07:01 IST

దిల్లీలో కలకలం రేపిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధావాకర్‌ హత్యకేసు లాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో మరొకటి వెలుగు చూసింది. ఫిబ్రవరి 24న సాఢ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. జహానాబాద్‌కు చెందిన రామ్‌సాగర్‌కు కొన్నేళ్ల క్రితం శాలుతో వివాహమైంది. భార్యతో ఇటీవల గొడవపడి.. పదునైన ఆయుధంతో ఆమెను అతి కిరాతకంగా రామ్‌సాగర్‌ హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్లాస్టిక్‌ సంచిలో దాచాడు. ఈ హత్యకు అతడి సోదరులు విద్యాసాగర్‌, శివసాగర్‌ సైతం సహాయం చేశారు. అనంతరం తెలిసిన ఆటో  డ్రైవర్లు మోను, నీరజ్‌ తివారీల సాయంతో శరీర భాగాలను ఆటోలో తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. ఓచోట రోడ్డుపై దొరికిన మహిళ శరీర భాగాల ఆధారంగా విచారణ చేపట్టగా.. ఈ దారుణం బయటపడినట్లు డీసీపీ సల్మాన్‌తాజ్‌ పాటిల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని