Crime News: శ్రద్ధావాకర్ తరహాలో మరో కిరాతక హత్య
దిల్లీలో కలకలం రేపిన కాల్సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్యకేసు లాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో మరొకటి వెలుగు చూసింది.
దిల్లీలో కలకలం రేపిన కాల్సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్యకేసు లాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో మరొకటి వెలుగు చూసింది. ఫిబ్రవరి 24న సాఢ్ పోలీస్స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. జహానాబాద్కు చెందిన రామ్సాగర్కు కొన్నేళ్ల క్రితం శాలుతో వివాహమైంది. భార్యతో ఇటీవల గొడవపడి.. పదునైన ఆయుధంతో ఆమెను అతి కిరాతకంగా రామ్సాగర్ హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచిలో దాచాడు. ఈ హత్యకు అతడి సోదరులు విద్యాసాగర్, శివసాగర్ సైతం సహాయం చేశారు. అనంతరం తెలిసిన ఆటో డ్రైవర్లు మోను, నీరజ్ తివారీల సాయంతో శరీర భాగాలను ఆటోలో తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. ఓచోట రోడ్డుపై దొరికిన మహిళ శరీర భాగాల ఆధారంగా విచారణ చేపట్టగా.. ఈ దారుణం బయటపడినట్లు డీసీపీ సల్మాన్తాజ్ పాటిల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు