TSPSC: టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల హ్యాకింగ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (ప్రకటన నం.14/2022) పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్ గుర్తించింది.
ప్రశ్నల సాఫ్ట్కాపీ వివరాలు బయటకు
నేటి టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా
15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష కూడా..
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (ప్రకటన నం.14/2022) పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్ గుర్తించింది. దీంతో ఈ నెల 12న (ఆదివారం) నిర్వహించాల్సిన సదరు రాత పరీక్షను వాయిదా వేసినట్లు శనివారం ప్రకటించింది. పరీక్ష వాయిదాపై అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (ప్రకటన నం.23/2023) రాత పరీక్షను సైతం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. టౌన్ప్లానింగ్ పోస్టులకు ఈ నెల 12న ఓఎంఆర్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు (శనివారం) టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి సమాచారం హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్.. టౌన్ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్ కాపీ సమాచారం హ్యాకింగ్కు గురైందని, ప్రశ్నల వివరాలు అభ్యర్థులకు చేరలేదని అభిప్రాయం వ్యక్తంచేసింది.
రంగంలోకి పోలీసులు!
వాస్తవానికి టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీకైందన్న విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కమిషన్ కార్యాలయానికి వచ్చి.. కంప్యూటర్లు హ్యాకింగ్ అయినట్లు సమాచారం ఉందని, ఒకసారి లాగిన్ వివరాలు చూసుకోవాలని సూచించారు. దీంతో కమిషన్ అధికారులు పరిశీలించి.. అత్యంత రహస్య సమాచారం ఉన్న కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్పీఎస్సీ అధికారులు బేగంబజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యంత రహస్యమైన సమాచారం లీకైనట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదుపులోకి ఇద్దరు..
సాధారణంగా కమిషన్లో అత్యంత రహస్య సమాచారం కీలకమైన హోదాల్లో ఉన్నవారి వద్ద ఉంటుంది. వారి లాగిన్ వివరాలతో ఎవరు కంప్యూటర్లను తెరిచారు? అందులో ఏ సమాచారం చూశారు? అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. కమిషన్ సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్