Crime News: అత్తను కొట్టి చంపిన అల్లుడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన అత్తను హత్య చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

Updated : 12 Mar 2023 08:06 IST

విశాఖపట్నం (విశాలాక్షినగర్‌), న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన అత్తను హత్య చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవ సీఐ సోమశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాణాల రాము ఆరేళ్లుగా హనుమంతువాక కొండవాలులో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. విద్యుత్తు పరికరాల మరమ్మతులు చేస్తుంటాడు. రెండురోజుల క్రితం అతని భార్య లక్ష్మికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో సపర్యలు చేసేందుకు అత్త నారాయణమ్మ (47) శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలి నుంచి కుమార్తె వద్దకు వచ్చారు. రాము శనివారం మద్యం తాగి ఇంటికి రావడంతో అత్త ప్రశ్నించారు. కట్టుకున్న భార్య ఆసుపత్రిలో ఉండగా.. మద్యం తాగడమేంటని నిలదీశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రాము ఇనుపరాడ్డు తీసుకుని ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ద్వారకా జోన్‌ ఏసీపీ మూర్తి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాము గతంలోనూ ఒక మహిళపై దాడి కేసులో జైలుకు వెళ్లివచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని