Crime News: ప్రాణాంతకమైన యువతుల ప్రేమ
ఇద్దరు యువతుల స్నేహం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లి.. చివరకు హత్యకు దారితీసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసింది.
స్నేహితురాలిని హత్య చేసిన యువతి
మంచిర్యాల జిల్లాలో ఘటన
మందమర్రి నేరవిభాగం, మందమర్రి పట్టణం, న్యూస్టుడే: ఇద్దరు యువతుల స్నేహం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లి.. చివరకు హత్యకు దారితీసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి (21) నెన్నెల మండలం మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేష్తో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట మంచిర్యాలలో అద్దెకు గది తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్తో పాటు అంజలి కలిసి ఉంటున్నారు. అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తుండగా, మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేసి ఇటీవల మానేసింది. మన్నెగూడం వీఆర్ఏ మొండి అయిదుగురు ఆడపిల్లల్లో నాలుగో కుమార్తె మహేశ్వరి. గత పదేళ్లుగా ఆమె వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కొన్ని రోజులుగా దూరం..
మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్తో మహేశ్వరికి పరిచయమైంది. తర్వాత ఆమె చెల్లెలు, సోదరుడు, అంజలితోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా అంజలి శ్రీనివాస్తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. బుధవారం విధులు ముగించుకున్న అంజలి రాత్రి 8.15 గంటలకు గదికి వెళ్లింది. 10 గంటల వేళ మామిడిగట్టుకు వెళ్దామంటూ.. మహేశ్వరి ద్విచక్ర వాహనంపై అంజలిని వెంటబెట్టుకుని బయలుదేరింది. రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్కు మహేశ్వరి ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని, తాను కూడా చేసుకుంటున్నానని చెప్పడంతో ఆయన వెంటనే పరమేశ్వరితో కలిసి కారులో గుడిపల్లి గ్రామ శివారులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అంజలి మృతి చెందింది. ఆమె మెడపై లోతైన గాయం ఉండడంతో మహేశ్వరి ఆమెను హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్వరి పొట్ట, మెడపై చిన్నపాటి కత్తిగాట్లు ఉండడంతో.. ఆత్మహత్యాయత్నం పేరిట ఆమె నమ్మించేందుకు ప్రయత్నించిందని భావిస్తున్నారు. అంజలి మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళనకు దిగారు. రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరి, శ్రీనివాస్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు