Andhra News: టిప్పర్ డ్రైవరా మజాకా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహసం..
48 మీటర్ల వెడల్పు.. రెండు మీటర్ల లోతు కాలువ.. అలలతో కూడిన 2వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. మధ్యలో అవరోధాలు.. రెండు గంటలపాటు ఆపకుండా ఈత.. గట్టుపై పోలీసుల పరుగు.. అయినా అతడు ఆగకుండా మూడు కి.మీ. ఈదాడు.
పోలీసులను తప్పించుకోవడానికి 3 కి.మీ. ఈత
సంగం, పొదలకూరు- న్యూస్టుడే: 48 మీటర్ల వెడల్పు.. రెండు మీటర్ల లోతు కాలువ.. అలలతో కూడిన 2వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. మధ్యలో అవరోధాలు.. రెండు గంటలపాటు ఆపకుండా ఈత.. గట్టుపై పోలీసుల పరుగు.. అయినా అతడు ఆగకుండా మూడు కి.మీ. ఈదాడు. పోలీసులనుంచి తప్పించుకోవడానికి ఓ టిప్పర్ డ్రైవర్ చేసిన సాహసమిది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటాచలం మండలం ఇడిమేపల్లికి చెందిన చల్లా కృష్ణ వింజమూరుకు టిప్పర్ తీసుకెళుతున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టి ఆగకుండా సంగం వైపు వేగంగా వస్తూ గేదెనూ ఢీకొన్నారు. వాహనాన్ని ఆపాలని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంబడించి టిప్పర్ బెజవాడ పాపిరెడ్డి కాలువ వైపు వెళుతూ అదుపుతప్పి కనిగిరి జలాశయం ప్రధాన కాలువ గట్టుపై ఆగడాన్ని గమనించారు. డ్రైవర్ కనిగిరి జలాశయం కాలువలో దూకి ఈదుతూ వెళుతున్నట్లు గుర్తించారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలో ఈదడం ప్రమాదమంటూ ఎస్సై కె.నాగార్జునరెడ్డి అక్కడికి వెళ్లి గట్టుపై పరుగెడుతూ కృష్ణను హెచ్చరించారు. దీంతో మరింత భయపడిన అతడు వేగంగా ఈదసాగాడు. కాలువలో ఒక చోట చెట్లను పట్టుకుని కాసేపు సేదదీరాడు. అక్కడే బెండు ముక్క దొరకడంతో దాని ఊతంగా తిరిగి ఈత మొదలుపెట్టాడు. లాభం లేదని సంగంలోని గజ ఈతగాడు వెంకటేశ్వర్లును పోలీసులు రంగంలోకి దించారు. పోలీసులు కొట్టకుండా చూస్తానని చెప్పి కృష్ణను వెంకటేశ్వర్లు గట్టుకు తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?