రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం
వాళ్లిద్దరూ స్నేహితులు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఈక్రమంలో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్న స్నేహితుడిని వెంట తీసుకెళ్లేందుకు మరో స్నేహితుడు ద్విచక్ర వాహనంపై చెన్నై బయల్దేరగా..
ఎన్హెచ్పై చెక్పోస్టు గోడను ఢీకొన్న ద్విచక్ర వాహనం
తడ, న్యూస్టుడే: వాళ్లిద్దరూ స్నేహితులు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఈక్రమంలో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్న స్నేహితుడిని వెంట తీసుకెళ్లేందుకు మరో స్నేహితుడు ద్విచక్ర వాహనంపై చెన్నై బయల్దేరగా.. రహదారి ప్రమాదానికి గురై ఇద్దరూ తనువు చాలించారు. తిరుపతి జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి డైవర్షన్ గోడను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లికి చెందిన దండు వెంకటరమణ (30), యలకచర్ల అరుణ్ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తమిళనాడు పోలీసులు గుర్తించి తడ పోలీసులకు సమాచారం అందించారు.
* కలువాయిలో ఉంటున్న వెంకటరమణ టిప్పర్ డ్రైవర్గా పనిచేసేవాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అవివాహితుడు. ఇతనికి ఒక అన్న ఉన్నాడు. వారం రోజలుగా కుటుంబ కలహాలతో అలిగి ఇంటికి వెళ్లడం మానేశాడు. యలకచర్ల అరుణ్కు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. ప్రస్తుతం భార్య గర్భిణి. తల్లిదండ్రులు అనంతమ్మ, చిన్నరేణయ్యలకు ఇద్దరు సంతానం. అరుణ్ తమిళనాడు పరిధిలోని కోడంబాక్కం వద్ద హౌస్కీపింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం స్వగ్రామం వచ్చిన అతను స్నేహితుడు వెంకటరమణను కలుసుకున్నాడు. అతడిని ఏదైనా పనిలో పెట్టాలని నిర్ణయించుకుని సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంలో చెన్నై బయల్దేరారు. తడ మండలం పన్నంగాడు వద్దకు వచ్చేసరికి తమిళనాడు పరిధిలోని ఎళావూరు చెక్పోస్టుకు వాహనాలను మళ్లించేందుకు ఏర్పాటుచేసిన డైవర్షన్ గోడను అదుపుతప్పి ఢీకొన్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తడ ఎస్సై జేపీ శ్రీనివాసరెడ్డి మృతుల వివరాలు గుర్తించి బంధువులకు సమాచారం చేరవేశారు. మృతదేహాలను సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
* తొలుత ఘటన జరిగిన ప్రదేశం ఎవరి పరిధిలోకి వస్తుందన్న విషయమై సందిగ్ధం నెలకొనడంతో చివరకు సర్వేయరు సహకారంతో ఏపీ పరిధిగా తేల్చారు. తమిళనాడు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్