Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి.
ఇటీవల ధర్మవరంలో వెలుగుచూసిన నకిలీ నోటు
ధర్మవరం, న్యూస్టుడే : చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. నోట్ల రద్దు అనంతరం కొన్నేళ్ల పాటు తగ్గినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. దందాతో చిరువ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో వెలుగుచూస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఆయా నోట్లపై పెన్నుతో మార్కింగ్ వేసి ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో చించి పడేస్తున్నారు. సామాన్యులు ఏది అసలో, ఏది నకిలీనో తెలుసుకోలేక మోసపోతున్నారు.
ధర్మవరంలో మూడు నెలలుగా దొంగ నోట్ల మార్పిడి ఊపందుకుంది. రూ.500కు చిల్లర ఇవ్వాలంటేనే ధర్మవరంలో నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఈప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. దీంతో నకిలీ నోట్లు ఎవరు ఇచ్చారో చెప్పలేని పరిస్థితి తలెత్తుతోంది. మోసపోయినవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా జంకుతున్నారు. బాధితులంతా ఎక్కువగా శాతం చిరువ్యాపారులు, కార్మికులే. పెద్ద వ్యాపారుల వద్ద లెక్కింపు యంత్రాలు ఉండటంతో సులువుగా దొంగనోట్లను గుర్తిస్తున్నారు.
40 శాతం కమీషన్..!
తాడిమర్రి మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దొంగ నోట్ల డొంక కదిలింది. కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వారు నోట్లు చలామణి చేస్తున్నట్లు కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కడప, బెంగళూరు, ప్రాంతాల నుంచి ధర్మవరానికి నోట్లు తీసుకొచ్చి.. కొందరు దళారులను ఏర్పాటు చేసుకొని తమ పనిని అత్యంత సులువుగా కానిచ్చేస్తున్నారు. దళారులకు 40 శాతం మేర కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
నిఘా పెంచుతాం..
- హుస్సేన్పీరా, ఇన్ఛార్జి డీఎస్పీ, ధర్మవరం
నకిలీనోట్ల చలామణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి కట్టడి చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్