Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
విజయవాడలో ఓ యువకుడి నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సతీష్... కాకినాడలో చదువుకుంటున్నాడు.
ఈనాడు, అమరావతి: విజయవాడలో ఓ యువకుడి నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సతీష్... కాకినాడలో చదువుకుంటున్నాడు. అతనికి అక్కడే ఓ కళాశాలలో ఫోరెన్సిక్ కోర్సు చదువుతున్న కేరళకు చెందిన అబ్దుల్ మిషాల్ అహ్మద్ పరిచయం అయ్యాడు. అతని ప్రోద్బలంతో డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో గంజాయి రవాణాను ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి తీసుకొచ్చి.. బెంగళూరుకు తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఇందుకోసం సతీష్కు మిషాల్ డబ్బులిచ్చేవాడు. బెంగళూరులో మిషాల్ సొంతంగా ఎండీఎంఏ(మిథలీన్ డైఆక్సీ మెటాఫెటామిన్) అనే డ్రగ్ను క్రిస్టల్ రూపంలో తయారు చేయడం ప్రారంభించాడు. దీనిని కాకినాడ, హైదరాబాద్లోని కస్టమర్లకూ సరఫరా చేసేవాడు. 6 నెలలుగా బెంగళూరు నుంచి ఎండీఎంఏను తీసుకొచ్చి సతీష్ విక్రయిస్తున్నాడు. ఈనెల 1న కాకినాడ నుంచి బెంగళూరుకు రైలులో బయలుదేరాడు. అక్కడే మిషాల్ గదిలో 3 రోజులు బసచేశాడు. తిరిగి 5న కాకినాడకు 48.6 గ్రాముల డ్రగ్స్ను పాయసం మిక్స్ డబ్బాలో పెట్టుకుని బయలుదేరాడు. దీనిని పెద్దాపురంలో తమిళనాడుకు చెందిన మహేంద్రన్, కేరళకు చెందిన గోకుల్ కృష్ణన్కు, హైదరాబాద్కు చెందిన అఖిల్, కాకినాడలో అలెక్స్, విజయ్లకు సరఫరా చేసేందుకు డబ్బు తీసుకున్నాడు. బెంగళూరు నుంచి కాకినాడకు వస్తూ.. విజయవాడలో దిగిపోయాడు. అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.