రూ.7.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత
వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు పట్టుకున్నారు.
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల స్వాధీనంచేసుకున్న అధికారులు
ఈనాడు, అమరావతి: వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్లు ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ కె.ఇంజినీర్ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో 30మంది అధికారులతో కూడిన కస్టమ్స్ బృందాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో అయిదు కిలోల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి మరో 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12.97 కిలోలు సీజ్ చేసినట్టు వెల్లడించారు. కస్టమ్స్ చట్టం కింద నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 2022-23లో ఇప్పటివరకు విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో రూ. 19.75 కోట్ల విలువైన బంగారం పట్టుకున్నట్టు కమిషనర్ ఇంజినీర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!