కానిస్టేబుల్‌ కొట్టాడని దళితుడి ఆత్మహత్యాయత్నం

తనను ఏఆర్‌ కానిస్టేబుల్‌ కులం పేరుతో దూషించి కొట్టాడన్న మనస్తాపంతో నంద్యాల జిల్లా మునగాల గ్రామానికి చెందిన నరహరి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Published : 23 Mar 2023 04:21 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: తనను ఏఆర్‌ కానిస్టేబుల్‌ కులం పేరుతో దూషించి కొట్టాడన్న మనస్తాపంతో నంద్యాల జిల్లా మునగాల గ్రామానికి చెందిన నరహరి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. నరహరి ఉగాది పండగ సందర్భంగా గ్రామస్థులతో కలిసి గ్రామ సమీపంలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ జంబులయ్యతోపాటు మరికొందరు గుడికి ఎందుకొచ్చావంటూ కులం పేరుతో దూషిస్తూ కొట్టారని నరహరి ఆరోపించారు. ప్రస్తుతం ఆయన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని