యూపీలో ఉన్మాద హంతకుల అరెస్టు
ఉత్తర్ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరిని రెండు నెలల క్రితం అరెస్టు చేయగా, మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబరులో బారాబంకీ జిల్లాలో రెండు వరుస హత్యలు కలకలం రేపాయి. నిందితులు బహిర్భూమికి వెళ్లిన వృద్ధ మహిళలను చంపి అత్యాచారం చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల్లో ఒకరిని సడ్వా బెలూ గ్రామానికి చెందిన అమరేంద్రగా గుర్తించారు. జనవరి 23న అతడు ఓ వృద్ధురాలిపై దాడికి యత్నించగా.. బాధితురాలు కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా అమరేంద్ర స్నేహితుడు సురేంద్ర కూడా ఈ నేరాల్లో పాలుపంచుకున్నట్లు తెలిసింది. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం సురేంద్రను అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన