యూపీలో ఉన్మాద హంతకుల అరెస్టు
ఉత్తర్ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరిని రెండు నెలల క్రితం అరెస్టు చేయగా, మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబరులో బారాబంకీ జిల్లాలో రెండు వరుస హత్యలు కలకలం రేపాయి. నిందితులు బహిర్భూమికి వెళ్లిన వృద్ధ మహిళలను చంపి అత్యాచారం చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల్లో ఒకరిని సడ్వా బెలూ గ్రామానికి చెందిన అమరేంద్రగా గుర్తించారు. జనవరి 23న అతడు ఓ వృద్ధురాలిపై దాడికి యత్నించగా.. బాధితురాలు కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా అమరేంద్ర స్నేహితుడు సురేంద్ర కూడా ఈ నేరాల్లో పాలుపంచుకున్నట్లు తెలిసింది. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం సురేంద్రను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.