అయిదు పేర్లు... రూ.1.26 కోట్ల మోసాలు
కాగితాల్లోనే కంపెనీని స్థాపించి, కలర్ఫుల్ బ్రోచర్లను ముద్రించి, వ్యాపారం చేసేందుకు డీలర్షిప్ ఇస్తానంటూ మభ్యపెట్టి, సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాడు రంజిత్ తివారీ... తెలంగాణ సీఐడీకి చిక్కాడు.
తెలంగాణ సీఐడీకి చిక్కిన అంతర్రాష్ట్ర మోసగాడు
ఈనాడు, హైదరాబాద్: కాగితాల్లోనే కంపెనీని స్థాపించి, కలర్ఫుల్ బ్రోచర్లను ముద్రించి, వ్యాపారం చేసేందుకు డీలర్షిప్ ఇస్తానంటూ మభ్యపెట్టి, సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాడు రంజిత్ తివారీ... తెలంగాణ సీఐడీకి చిక్కాడు. రాష్ట్రంలోని సింధూర ట్రేడర్స్ యాజమాన్యాన్ని రూ.42 లక్షల మేర మోసగించిన కేసులో అతను నిందితుడు. సీఐడీ పోలీసులు హరియాణా రాష్ట్రం గురుగ్రామ్ జైలు నుంచి తివారీని మూడు రోజుల క్రితం పీటీవారంట్పై పట్టుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే... దిల్లీకి చెందిన తివారీ మెరిక్ బయోటెక్ లిమిటెడ్ పేరిట ఆయుర్వేద, చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీని గతంలో ప్రారంభించాడు. సంస్థ పేరిట కలర్ఫుల్ బ్రోచర్లను ముద్రించాడు. ప్రాంతాలవారీగా సేల్స్ మేనేజర్లను నియమించుకుని ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. ఉత్తరాదిలో తమది పేరుమోసిన సంస్థ అని.. దక్షిణాదిలో రాష్ట్రాలవారీగా డీలర్లను నియమించుకుంటున్నట్లు చెప్పేవాడు. ఈ క్రమంలో 2019లో తెలంగాణకు చెందిన సింధూర ట్రేడర్స్ నిర్వాహకులు ఆసక్తి చూపడంతో తివారీ... ధరావత్తు కింద రూ.6 లక్షలతోపాటు ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు రూ.36 లక్షలను తీసుకున్నారు. తర్వాత సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తివారీని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. ఇటీవల సీఐడీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న మహేశ్ భగవత్ అపరిష్కృత కేసులపై దృష్టి సారించారు. ఈక్రమంలో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఉపేంద్రారెడ్డి నేతృత్వంలో ఎస్సై సర్దార్ సత్పాల్సింగ్, ఏఎస్సై అశోక్, కానిస్టేబుల్ శ్రీనివాస్తో కూడిన బృందం గురుగ్రామ్ వెళ్లింది. తివారీ అప్పటికే అక్కడ జైల్లో ఉన్నట్లు తేలడంతో పీటీ వారంట్పై హైదరాబాద్కు పట్టుకొచ్చింది.
గురుగ్రామ్లోనూ మోసాలు
సీఐడీ బృందం గురుగ్రామ్కు వెళ్లాక తివారీ లీలలు బహిర్గతమయ్యాయి. అతను రాజీవ్ సక్సేనా, హిమాంశు ఉపాధ్యాయ, రంజిత్ అవదేశ్ తివారీ, రంజిత్కుమార్ తివారీ పేర్లతోనూ చలామణి అయినట్లు వెల్లడైంది. తెలంగాణాకే చెందిన యశోద ఎంపెర్సా నిర్వాహకుడు నిమ్మ నిఖిత్రెడ్డిని, గురుగ్రామ్కు చెందిన వ్యాపారి వీరేంద్రకుమార్ తదితరులను మోసగించి, రూ.1.26 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది. వీరేంద్రకుమార్ ఫిర్యాదుతోనే గురుగ్రామ్ పోలీసులు తివారీని అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం