చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
తొమ్మిదేళ్ల క్రితం నాటి హత్యకేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితురాలిని పోలీసులు విచారించారు. అనంతరం పోలీసులు సమర్పించిన చార్జిషీటు ఆధారంగా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఆగ్రా: తొమ్మిదేళ్ల క్రితం నాటి హత్యకేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితురాలిని పోలీసులు విచారించారు. అనంతరం పోలీసులు సమర్పించిన చార్జిషీటు ఆధారంగా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పోలీసు విచారణలో సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం సాధారణ విషయమే కదా.. అనుకోవచ్చు! ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన సాక్షి.. ఓ చిలుక. అదేంటీ.. జంతువులు, పక్షుల సాక్ష్యం చెల్లదు కదా అంటారా? అయితే, చిలుక వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో కాదు.. పోలీసుల విచారణలో. నిందితులను గుర్తించేందుకు ఆ చిలుకే సాయపడింది. ఆగ్రాకు చెందిన విజయ్శర్మ భార్య నీలమ్శర్మ 2014 ఫిబ్రవరి 20న ఇంట్లో హత్యకు గురయ్యారు. నిందితులు ఆమెను, వారి పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో అనుమానితులుగా కొంతమందిని పోలీసులు విచారించినా.. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి విజయ్శర్మ పెంపుడు చిలుక సరిగా తినకపోవడం, అతడి మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తుండటం చేసేది. దీంతో హత్య చేసినవారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజయ్శర్మ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో గతంలో విచారించిన అనుమానితులతోపాటు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలుక అషును చూసి అరుస్తుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. రోన్నీ అనే వ్యక్తితో కలిసి నీలమ్శర్మను నగలు, డబ్బు కోసం తానే హత్య చేసినట్లు అషు అంగీకరించింది. పోలీసులు చార్జిషీట్లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దాన్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులిద్దరికీ జీవితఖైదు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్