తెదేపా నాయకుడి హత్య
తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నాయకుడు హత్యకు గురయ్యారు. కొవ్వూరు మండలం వేములూరు, నందమూరు తెదేపా యూనిట్ ఇన్ఛార్జి, వేములూరు ఉప సర్పంచి శీని సత్య వరప్రసాద్ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లా వేములూరులో ఘటన
ఇంటి వరండాలో మృతదేహం
హతుడి భార్య ఫిర్యాదుతో హత్య కేసు నమోదు
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నాయకుడు హత్యకు గురయ్యారు. కొవ్వూరు మండలం వేములూరు, నందమూరు తెదేపా యూనిట్ ఇన్ఛార్జి, వేములూరు ఉప సర్పంచి శీని సత్య వరప్రసాద్ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సత్య వరప్రసాద్ భార్య శ్రీకళ ఉద్యోగం నిమిత్తం జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. కుమార్తె ఏలూరులో, కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ చదువుకుంటున్నారు. సత్య వరప్రసాద్ ఒక్కరే వేములూరులోని సొంత ఇంట్లో ఉంటున్నారు. శనివారం రాత్రి 10 గంటల వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడారు. ఆదివారం స్థానికులు రావిపాటి వెంకట్రావు, తిరుమరెడ్డి ఆంజనేయులు ఆయన ఇంటికి వెళ్లారు. వరండాలో దుప్పటి కప్పుకొని ఉండటంతో పడుకున్నారని భావించారు. పిలిచినా ఎంతకూ పలకకపోవడంతో వెళ్లి దుప్పటి తీయగా.. గాయాలతో సత్య వరప్రసాద్ మృతదేహం కనిపించింది. బోర్లా పడి ఉన్న మృతదేహంపై దుస్తుల్లేవు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సీఐ రవికుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎడమ దవడపై గాయం, ఎడమ చెవి నుంచి రక్తస్రావం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గదిలో గొడవ పడి, వరండాలోకి తీసుకొచ్చి తలను గోడకేసి కొట్టి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీకళ ఫిర్యాదుపై హత్యకేసు నమోదు చేశారు.
వివాద రహితుడిగా పేరు..
తమ కంటే ఊరికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని, ఎందుకిలా జరిగిందో తెలియదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు తమతో మాట్లాడారని పిల్లలు ఆవేదన చెందారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని స్థానికులు కొందరు తెలిపారు. వివాద రహితుడిగా, పార్టీలకు అతీతంగా సత్య వరప్రసాద్కు మంచి పేరుందన్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని తోటి సభ్యులతో కలిసి పలు సందర్భాల్లో బహిరంగంగానే పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకుమించి రాజకీయంగా వివాదాల్లేవని తెలిపారు. కుటుంబ ఆస్తి తగాదాలు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వర్మ తెలిపారు.
* హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని, హోం మంత్రి ఇలాకాలో శాంతి, భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!