పొలాన్ని ఆక్రమించారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని ఇతరులు రిజిస్టర్ చేయించుకుని అన్యాయం చేశారంటూ ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది.
అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన
అచ్చంపేట, న్యూస్టుడే: పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని ఇతరులు రిజిస్టర్ చేయించుకుని అన్యాయం చేశారంటూ ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం చెందిన పల్లప్రోలు శ్రీనివాసరెడ్డి, సంపూర్ణమ్మ దంపతులకు చామర్రు రెవెన్యూ పరిధిలో వేర్వేరు సర్వే నంబర్లలో పూర్వీకుల నుంచి సంక్రమించిన 2.78 ఎకరాల పొలం ఉంది. వారికి తెలియకుండా బంధువులు కొందరు ఆ పొలాన్ని ఇతరులకు రిజిస్టర్ చేయించారు. పాసు పుస్తకాలు పొందారు. ఈ విషయం తెలిసిన బాధితులు.. పొలాన్ని కొన్నేళ్లుగా తామే సాగు చేసుకుంటున్నామని, న్యాయం చేయాలని స్థానిక రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయస్థానంలోనూ కేసు వేశారు. అయినా రిజిస్టర్ చేయించుకున్నవారు బెదిరించి పొలాన్ని దున్నేందుకు ఇటీవల ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన సంపూర్ణమ్మ మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద పురుగుమందు తాగింది. ఈ విషయమై తహసీల్దార్ పద్మాదేవి మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి వద్ద పొలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న వారికి పాసు పుస్తకాలు జారీ చేశామన్నారు. ఈ పొలంలో 50 సెంట్ల ఆక్రమణ భూమి ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ