సైబర్ మోసాలకిదో ఆధారం
ఆధార్లో సులభంగా చిరునామా మార్చుకునేందుకు ఉన్న అవకాశం సైబర్ మోసాలకు దారి తీసే అతి పెద్ద కారణాల్లో ఒకటని పోలీసులు తెలిపారు.
సులభంగా చిరునామా మార్పే కారణమంటున్న పోలీసులు
దిల్లీ: ఆధార్లో సులభంగా చిరునామా మార్చుకునేందుకు ఉన్న అవకాశం సైబర్ మోసాలకు దారి తీసే అతి పెద్ద కారణాల్లో ఒకటని పోలీసులు తెలిపారు. పలు కేసులను విచారించగా ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఆధార్ కార్డున్న వ్యక్తి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, దానిని నింపి.. ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలర్, గెజిటెడ్ అధికారి, ఎంబీబీఎస్ వైద్యుడి సంతకంతో అప్లోడ్ చేస్తే చిరునామా మారుతోంది. ఇందులో చాలావరకు నకిలీ రబ్బరు స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తుల వివరాలను తెలుసుకోకుండా ఈ అధికార ప్రముఖులు నిర్లక్ష్యంగా సంతకాలు చేయడమూ సైబర్ మోసాలకు కారణమవుతోంది. ఉదాహరణకు ఒక కేసు దర్యాప్తులో భాగంగా విచిత్రమైన విషయం బయటపడింది. చిరునామా మార్పు కోసం ఓ వ్యక్తి దరఖాస్తుపై ఎమ్మెల్యే సంతకం చేశారు. దర్యాప్తు జరపగా.. స్టాంపు వేసే పనిని ఆఫీస్ బాయ్కు ఆయన అప్పగించినట్లు తేలింది. ఎమ్మెల్యే కేవలం సంతకాలకే పరిమితమయ్యారు. మరో కేసులో ఇద్దరు నైజీరియన్లతోపాటు ఆరుగురు చిరునామాలను మార్చి ఎన్నారై పెళ్లి కుమారుల్లా అమ్మాయిలకు వల వేశారు. ఈ కేసులో కేవలం రూ.500 తీసుకుని ఓ వైద్యుడు సంతకం చేశారు. సైబర్ మోసగాళ్లు చాలాసార్లు చిరునామాలను మార్చి బ్యాంకు ఖాతాలను తెరిచి బాధితుల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఆధార్ కార్డుల అప్డేషన్లోనూ కొందరు మోసాలు చేస్తున్నారు. ఎడమచేతి వేలి ముద్రలను కుడి చేతివిగా, కుడి చేతివి ఎడమ చేతివిగా నమోదు చేయించడంతోపాటు రంగుల కాంటాక్ట్ లెన్స్తో ఆధార్ వివరాలను మార్చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు