సేవ చేస్తామంటూ.. బురిడీ కొట్టించారు!
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద సర్కారు బడులను బాగు చేస్తామని ఓ సంస్థ చెప్పడంతో ఉన్నతాధికారులు సరే అన్నారు.
సర్కారు బడుల్లో నియామకాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు
ఆదిలాబాద్ పాలనాప్రాంగణం, న్యూస్టుడే: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద సర్కారు బడులను బాగు చేస్తామని ఓ సంస్థ చెప్పడంతో ఉన్నతాధికారులు సరే అన్నారు. అదే అదనుగా ఆ సంస్థ బడుల్లో ఉద్యోగాలంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో బయటపడింది. సీఎస్ఆర్ కింద ప్రభుత్వ పాఠశాలల్లో సాంస్కృతిక, కృత్యాధార బోధనతోపాటు న్యూట్రిగార్డెన్లు అభివృద్ధి చేస్తామంటూ కేర్ ఫౌండేషన్ పేరిట కొందరు ప్రతినిధులు ఫిబ్రవరి 22న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ను కలిశారు. ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలవాలని సూచించారు. అదనపు కలెక్టర్ను కలిసిన ప్రతినిధులు.. సీఎస్ఆర్ కింద పాఠశాలల్లో బోధకులతోపాటు పోషకాలు అందించేలా బడి తోటలను అభివృద్ధి చేస్తామంటూ ఓ లేఖను అందించారు. వారి మాటలు నమ్మిన ఆయన పాఠశాలల జాబితా కోసం డీఈవోను కలవాలని పురమాయించారు. ఈ క్రమంలో 130 బడుల జాబితాను ఇస్తూ సదరు సంస్థకు సహకారం అందించాలని హెచ్ఎంలకు సూచిస్తూ ఈ నెల 3న డీఈవో కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడే అసలు తంతు మొదలైంది. డీఈవో కార్యాలయ ఉత్తర్వు కాపీని జత చేస్తూ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని సదరు సంస్థ ప్రతినిధులు నిరుద్యోగులకు గాలం వేశారు. ఏకంగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ నిరుద్యోగులను పాఠశాలలకు పంపుతున్నారు. వీరు సీఎస్ఆర్ కింద పని చేస్తున్నారని ఆయా పాఠశాలల హెచ్ఎంలు కూడా నమ్మారు.
బయటపడిందిలా..
బేల ప్రాంతం నుంచి ఒకరు విద్యాశాఖ సెక్టోరల్ అధికారి నర్సయ్యకు ఫోన్ చేసి.. ‘ఏదో టీచరు పోస్టుకు ఫౌండేషన్ వారు రూ.2 లక్షలు కావాలంటున్నారు. కన్సెషన్ ఇప్పించండి’ అని కోరడంతో వసూళ్ల పర్వం బయటపడింది. వెంటనే తేరుకున్న అధికారులు.. ఆ సంస్థ లెటర్లతో వచ్చే వారిని చేర్చుకోవద్దని హెచ్ఎంలకు సందేశాలు పంపారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
కిందటి నెలలో ఓ ఫౌండేషన్ వారు మమల్ని కలిసిన మాట వాస్తవమే. సీఎస్ఆర్ కింద పాఠశాలల్లో సౌకర్యాలు సమకూరుస్తామంటే సహకరిస్తామని చెప్పాం. అంతేగానీ ఆ సాకుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మాకు తెలియదు. ఎవరైనా వారికి డబ్బులు ఇచ్చినట్లు ఫిర్యాదు చేస్తే ఫౌండేషన్ ప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పిస్తాం.
రిజ్వాన్ బాషా షేక్, అదనపు పాలనాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?