Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులు తమ పిల్లల వద్ద ఉంటూ ఆనందంగా సేదదీరాల్సిన సమయం.
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులు తమ పిల్లల వద్ద ఉంటూ ఆనందంగా సేదదీరాల్సిన సమయం. కుమార్తెలకు పెళ్లిళ్లయి అత్తవారింటికి వెళ్లిపోవటం, కుమారులు బతుకుదెరువు కోసం దూరంగా ఉండటంతో ఇంటి వద్ద ఇద్దరే మిగిలారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమెకు సపర్యలు చేద్దామంటే భర్తకు చేతకాని పరిస్థితి. ఈ దశలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవరకద్రకు చెందిన బండ ఆంజనేయులు(65), సత్యమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమారుడికి మినహా అందరికీ వివాహాలయ్యాయి. కుమారులు హైదరాబాద్లో ఉంటున్నారు. ఒకరు వ్యాపారం, మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆంజనేయులు, సత్యమ్మలు దేవరకద్రలోని ఇంటి వద్దే ఉండేవారు. మూడేళ్ల కిందట సత్యమ్మకు పక్షవాతం రావడంతో అప్పటి నుంచి ఆంజనేయులే భార్యకు సపర్యలన్నీ చేస్తున్నారు. ఆస్తిపాస్తులు ఉన్నా అవసాన దశలో ఎవరి సహాయం లేకుండా జీవించాల్సి వస్తోందని మనస్తాపానికి గురైన దంపతులు గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం చుట్టుపక్కల వారు ఇంటి తలుపుతట్టగా ఈ విషయం వెలుగుచూసింది. స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై దేవరకద్ర ఎస్సై భగవంతరెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. -
జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్రావు మాజీ పీఏ
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిని చంపిన తండ్రి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. -
వృద్ధురాలిపై చెప్పుతో దాడి
తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. -
ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి
వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. -
అనిశాకు చిక్కిన ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్ జిల్లా డీఎస్పీ శేఖర్ తెలిపారు. -
గోవా జైల్లో ఉన్న డ్రగ్ డాన్ ఫైజల్ అరెస్టు
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైజల్(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
ఇఫ్తార్ ముగించి ఇంటికొస్తున్న బాలుడి కిడ్నాప్.. దారుణహత్య
మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. -
మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య!
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. -
భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
తాజా వార్తలు (Latest News)
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ