ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఇసుక గుంతలు
కృష్ణా నది నుంచి ఇసుక తరలించేందుకు వేసిన మట్టి కట్ట చుట్టూ తవ్విన భారీ గుంతలు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీశాయి.
పల్నాడు జిల్లా అమరావతిలో పండగ పూట విషాదం
అమరావతి, న్యూస్టుడే: కృష్ణా నది నుంచి ఇసుక తరలించేందుకు వేసిన మట్టి కట్ట చుట్టూ తవ్విన భారీ గుంతలు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీశాయి. పరీక్షలు రాసి ఇంటికొచ్చిన విద్యార్థులు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆ గుంతల్లో పడి మృత్యువాత పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా అమరావతిలో చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం 75త్యాళ్లూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి (17), రాజశేఖరరెడ్డి (17) గుంటూరులోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవలే సొంతూరికి వచ్చారు. గురువారం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం సెల్ఫోన్ మరమ్మతు చేయించుకోవాలని చెప్పి స్నేహితులు కార్తీకరెడ్డి, నాగనితిన్రెడ్డితో కలిసి అమరావతి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. అక్కడ లోతు తెలియకపోవడంతో మల్లికార్జునరెడ్డి, రాజశేఖరరెడ్డి నీటిలో మునిగిపోయారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడ్డారు. సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలిద్దరూ విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమరావతి రీచ్లో తవ్విన ఇసుక రవాణా కోసం కృష్ణా నదికి అడ్డుగా మట్టి కట్ట వేశారు. దీనికోసం ఇరువైపులా సుమారు 20 అడుగుల లోతు గుంతలు తవ్వారు. ఆ గుంతల్లో పడి విద్యార్థులు మృత్యువాత పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు