Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

వేడినీళ్ల బకెట్లో పడిన 8 నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విజయవాడలో జరిగింది.

Updated : 31 Mar 2023 07:30 IST

విజయవాడ(చిట్టినగర్‌), న్యూస్‌టుడే: వేడినీళ్ల బకెట్లో పడిన 8 నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విజయవాడలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్టినగర్‌లోని లంబాడీపేట గాంధీ బొమ్మ ప్రాంతంలో ఆదిమల్ల ప్రణతి, ప్రేమ్‌కుమార్‌ దంపతులు తమ 8 నెలల పాప ప్రఖ్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న పాప పడుకున్న మంచం పక్కనే బకెట్లో వాటర్‌ హీటర్‌ పెట్టి తల్లి బయటకు వెళ్లారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేరు. కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో తల్లి పరుగున వచ్చి చూడగా ప్రఖ్య వేడినీటి బకెట్లో పడిపోయి కనిపించింది. శరీరమంతా కాలిపోవడంతో వెంటనే స్థానికులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 29వ తేదీ రాత్రి శిశువు మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు