పైసలివ్వనందుకు ప్రాణాలతో చెలగాటం
అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. పైగా దుబాయ్ వెళ్లేందుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పైసలు సమకూర్చకుంటే అందరం చచ్చిపోదామంటూ చెరువు వద్దకు బలవంతంగా తీసుకెళ్లాడు.
తల్లిదండ్రులతో నీటిలో మునిగే ప్రయత్నం
తండ్రి మృతితో బయటికి వచ్చిన కుమారుడు
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. పైగా దుబాయ్ వెళ్లేందుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పైసలు సమకూర్చకుంటే అందరం చచ్చిపోదామంటూ చెరువు వద్దకు బలవంతంగా తీసుకెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని అలాగే వదిలేసి, తల్లిని తీసుకొని బయటకు వచ్చాడు. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరేశ్ కథనం ప్రకారం... స్థానిక విద్యానగర్ కాలనీలో నివాసముండే మహ్మద్ సలీం(55), రేష్మాబేగం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలీం సంతానం. కలీంకు రెండేళ్ల క్రితం వివాహమైంది. తాగుడుకు బానిసవడంతో భార్య అతన్ని విడిచిపెట్టింది. పనిచేయకుండా తిరిగే కలీం డబ్బుల కోసం తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడేవాడు. దుబాయ్ వెళ్తానని, తనకు డబ్బులు ఇవ్వాలని ఇటీవల వారిని వేధించసాగాడు. వారం రోజుల్లో సమకూరుస్తామని చెప్పినా వినకుండా శుక్రవారం సాయంత్రం వారితో గొడవ పడ్డాడు. డబ్బులిస్తారా.. చావమంటారా అంటూ వాదనకు దిగాడు. అనంతరం ముగ్గురం చనిపోదామంటూ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. నీటిలో దిగిన తండ్రి సలీం మునిగిపోయాడు. భయపడిన కలీం భయంతో తల్లిని ఒడ్డుకు తీసుకుని బయటకు వచ్చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు పరుగున వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. రేష్మాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు