నిజామాబాద్లో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్లో శుక్రవారం మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న దాసరి హర్ష అనే విద్యార్థి బలవన్మరణం ఘటనను మరవక ముందే మరో విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
నెలరోజుల వ్యవధిలో రెండో ఘటన
నిజామాబాద్ వైద్యవిభాగం, వినాయక్నగర్, సెంటినరీకాలనీ, న్యూస్టుడే: నిజామాబాద్లో శుక్రవారం మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న దాసరి హర్ష అనే విద్యార్థి బలవన్మరణం ఘటనను మరవక ముందే మరో విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న మోసం సనత్(22) వసతిగృహంలోని తన గదిలో ఉరేసుకున్నాడు. నగరంలోని ఒకటో ఠాణా ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపిన ప్రకారం... పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలో ఉంటున్న రమేశ్, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయి మూడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా చిన్నకుమారుడు సనత్ నిజామాబాద్లో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రమేశ్ సింగరేణి ఓసీపీ-2లో వెల్డర్గా ఉద్యోగం చేస్తూ 15 ఏళ్లుగా సెంటినరీకాలనీలో నివాసముంటున్నారు. సనత్ గురువారం వసతిగృహం మూడో అంతస్తులోని తన గదిలో అర్ధరాత్రి వరకు స్నేహితులతో కలిసి చదువుకున్నాడు. ముగ్గురు ఉండాల్సిన గదిలో చదువు పూర్తికాగానే ఇద్దరు స్నేహితులు కూలర్ ఉన్న పక్క గదికి వెళ్లి నిద్రపోయారు. ఒంటరిగా ఉన్న సనత్ శుక్రవారం తెల్లవారుజామున 3.11 గంటలకు ‘సారీ మమ్మీ, డాడీ, అన్నయ్య... వాస్తవానికి నేను ఇలా చేద్దామని ఫార్మా పేపర్-1 అయ్యాకే అనుకున్నా. కానీ, అమ్మ, స్నేహితులు ఆందోళనకు గురవుతారని చేసుకోలే. సాయీ... నువ్వు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండు’ అని వాట్సప్లో మెసేజ్ టైప్ చేసి తనకు తానే పంపించుకున్నాడు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటినా సనత్ బయటికి రాకపోవడంతో తోటి స్నేహితులు తలుపులు కొట్టారు. అతని నుంచి స్పందన లేకపోవడంతో తలుపులను బలవంతంగా తెరిచి చూడగా బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. భీతిల్లిన విద్యార్థులు... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. మధ్యాహ్నం సమయంలో తల్లిదండ్రులు సుజాత, రమేష్లు నిజామాబాద్ చేరుకున్నారు. తమ కుటుంబంలో సమస్యలు లేవని మీడియాతో చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర మాట్లాడుతూ... 2020 బ్యాచ్కు చెందిన విద్యార్థి సనత్ చదువులో మెరుగ్గా ఉండేవాడని ఇలా జరగడం బాధాకరమన్నారు.
తిరుపతికి వెళ్దామన్నావే... ఇలా చేశావేంటి నాన్నా?
‘మరో నాలుగు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ముగియగానే అందరం కలిసి తిరుపతికి, విజయవాడకు వెళ్దాం నాన్నా. టికెట్లు బుక్ చేయండి’ అంటూ ఫోన్ చేసి చెప్పిన కొడుకు అంతలోనే ఇలా ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదంటూ సనత్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘మూడు ఆపరేషన్లు అయినా తట్టుకుని చదువు కొనసాగించావు. ఇప్పుడేమైందని ఇలా చేసుకున్నావు తండ్రీ...’ అని తల్లి విలపించడం అందర్నీ కలచివేసింది. సనత్ మృతితో సెంటినరీకాలనీలోనూ విషాదం నెలకొంది. అతను మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరిచాడు. నీట్లో 540 మార్కులను తెచ్చుకుని, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరానికి అర్హత సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు