గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
స్నేహితులతో సరదాగా ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నాన్నమ్మ చెంత చేరి.. కథ చెప్పమంటూ.. రాత్రి నిద్రపోయిన బాలిక గుండెపోటుతో శాశ్వతంగా దూరమైంది.
మరిపెడ, న్యూస్టుడే: స్నేహితులతో సరదాగా ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నాన్నమ్మ చెంత చేరి.. కథ చెప్పమంటూ.. రాత్రి నిద్రపోయిన బాలిక గుండెపోటుతో శాశ్వతంగా దూరమైంది. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అబ్బాయిపాలెం శివారు బోడతండాకు చెందిన బోడ లక్పతి, వసంత దంపతుల కుమార్తె స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తండాలోని తోటి మిత్రులతో ఆడుకుంది. ఎప్పటిలాగే రాత్రి నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసపడుతూ తనకేదో అవుతోందని చెప్పి నాన్నమ్మను నిద్ర లేపింది. మాట్లాడలేక ఆయాసపడుతూ లేచి కూర్చొని ఒక్కసారిగా మంచంపైనే ఒరిగిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు పరుగు తీశారు. అప్పటికే బాలిక గుండె ఆగిందని తెలుసుకొని విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.