స్టేషన్లోని సొత్తు కొట్టేసింది పోలీసులే
పోలీసులే దొంగలుగా మారారు. ఓ కేసులో స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్లో ఉంచిన సొత్తును గుట్టుగా చోరీచేశారు. కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడి
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: పోలీసులే దొంగలుగా మారారు. ఓ కేసులో స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్లో ఉంచిన సొత్తును గుట్టుగా చోరీచేశారు. కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. 2021 జనవరి 27న తమిళనాడు వ్యాపారి భారతిగోవింద్రాజ్ ఎలాంటి పత్రాలు లేకుండా 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు రవాణా చేస్తుండగా పట్టుకుని సీజ్ చేశారు. కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో సొత్తును భద్రపరచగా 2022లో అదే స్టేషన్లో రైటర్గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబు దానిపై కన్నేసి చోరీకి కుట్ర పన్నారు. అదే సంవత్సరం మే 24న ఆ స్టేషన్లో జప్తు చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే అదనుగా నిందితులు వెండి, నగదు అపహరించారు. తర్వాత బంగారం దుకాణం నిర్వహించే అమరావతి బంధువు భరత్సింహా ద్వారా విక్రయించారు. ఇటీవల తమిళనాడు వ్యాపారి వెండి కోసం రావటంతో సొత్తు మాయమైన విషయం వెలుగు చూసింది. నిందితులు రమణబాబు, అమరావతి, ఆమె భర్త విజయ్భాస్కర్, అతని తమ్ముడు భరత్సింహాలను అరెస్టు చేశారు. వారి నుంచి 81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు రికవరీ చేశారు. అమరావతి ప్రస్తుతం కౌతాళం పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా..రమణబాబు కోడుమూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.